IND vs ENG 2nd Test: విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు భారత్దే ఆధిపత్యం. టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (257 బంతుల్లో 179 నాటౌట్, 17 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకంతో రాణించడంతో పాటు శుభ్మన్ గిల్ (34), రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్ (27 నాటౌట్) లు రాణించడంతో మొదటిరోజు భారత్.. 93 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది.
వైజాగ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (14) మరోసారి విఫలమయ్యాడు. 41 బంతులాడిన హిట్మ్యాన్.. బషీర్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చాడు. రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్.. ధాటిగా ఆడేందుకు యత్నించాడు. 46 బంతుల్లో ఐదు బౌండరీల సాయంతో 34 పరుగులు చేసిన గిల్ను ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. లంచ్ లోపు భారత్.. రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. అప్పటికే జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తయింది.
అర్థ సెంచరీ తర్వాత శ్రేయస్ అయ్యర్తో జతకలిసిన జైస్వాల్.. మూడో వికెట్కు అతడితో కలిసి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. తొలి టెస్టులో విఫలమైన అయ్యర్.. రెండో టెస్టులో కూడా అదే బాటపట్టాడు. అయ్యర్ను టామ్ హర్ట్లీ ఔట్ చేశాడు. టీ విరామానికి ముందు జైస్వాల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 94 పరుగుల వద్ద ఉండగా సిక్సర్తో శతకాన్ని నమోదుచేశాడు. టెస్టులలో జైస్వాల్కు ఇది రెండో సెంచరీ కాగా స్వదేశంలో తొలి శతకం. అయ్యర్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి ఐదో వికెట్కు 70 పరుగులు జోడించాడు. అయితే మ్యాచ్ మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా అక్షర్.. బషీర్ వేసిన ఓవర్లో రిహాన్ అహ్మద్ చేతికి చిక్కాడు. . లోకల్ బాయ్ శ్రీకర్ భరత్.. (23 బంతుల్లో 17, 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ధాటిగా ఆడబోయి రిహాన్ అహ్మద్ బౌలింగ్లో బషీర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇంగ్లీష్ బౌలర్లలో అహ్మద్, బషీర్ లకు తలా రెండు వికెట్లు దక్కగా అండర్సన్, హర్ట్లీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Jaiswal and Patidar going strong out there in the middle.
They now have a partnership of 60* runs.
Live – https://t.co/Ne2d0hI6QB #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/ruIlumovjW
— BCCI (@BCCI) February 2, 2024
తొలి డబుల్ సాధించేనా..?
టెస్టులలో యశస్వీకి ఇదే అత్యుత్తమ స్కోరు. గతేడాది వెస్టిండీస్ టూర్లో ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్లోనే 171 పరుగులు చేసిన యశస్వీ.. తాజాగా వైజాట్ టెస్టులో ఆ స్కోరును అధిగమించాడు. ఆట రెండో రోజు పది ఓవర్ల దాకా క్రీజులో ఉన్నా జైస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేయడం ఖాయం. టెస్టులలో తొలి ద్విశతకం చేయడానికి జైస్వాల్కు మరో 21 పరుగులు మాత్రమే కావాలి.