ఆసియా కప్లో భాగంగా భారత్, అఫ్ఘానిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్ఘాన్ జట్టు మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఫ్ఘాన్ సారధి మహమ్మద్ నబీ కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసి తమను తాము ఛాలెంజ్ చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా సారధి కేఎల్ రాహుల్ చెప్పాడు. వరల్డ్ కప్లో ఆడే ఆటగాళ్ల పాత్రలను ఫైనలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, చాహల్లకు విశ్రాంతినిచ్చారు. వీరి స్ధానంలో దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఆడుతున్నారు.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
A look at our Playing XI for the game.
Live – https://t.co/QklPCXU2GZ #INDvAFG #AsiaCup2022 pic.twitter.com/QHicRuYneJ
— BCCI (@BCCI) September 8, 2022