ICC : భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు పెద్ షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ నియమావళి(ICC Code Of Conduct)ని ఉల్లంఘనకు పాల్పడినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో నాలుగో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతుండగా బుమ్రా ఉద్దేశపూర్వకంగా ఓలీ పోప్(Ollie Pope)కు అడ్డు తగిలాడు.
బుమ్రా వేసిన 81వ ఓవర్ పోప్ సింగిల్ తీసేందుకు పరుగందుకున్నాడు. అయితే.. భారత పేసర్ అతడికి అడ్డుగా నిలబడ్డాడు. దాంతో ఇద్దరూ ఢీకొట్టారు. బుమ్రా తీరుతో పోప్ కంగుతిన్నాడు. తన చర్య ద్వారా టీమిండియా పేసర్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి నివేదించాడు. ఇదే విషయంపై ప్రశ్నించగా బుమ్రా తన తప్పు అంగీకరించాడు. దాంతో, రిఫరీలు అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
The Code of Conduct breach occurred during the fourth day of #INDvENG first Test in Hyderabad 👀
Details 👇https://t.co/PPjnAhcBAY
— ICC (@ICC) January 29, 2024
తొలి టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. మొదటి రెండు రోజులు అసలు పోటీలోనే లేని బెన్ స్టోక్స్ సేన సంచలన ఆటతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్లో ఓలీ పోప్ సూపర్ సెంచరీతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే.. బుమ్రా ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడబోయి 196 వద్ద బౌల్డ్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లండ్ 420 రన్స్ కొట్టింది. బుమ్రా నాలుగు వికెట్లతో రాణించాడు.
ఓలీ పోప్ (196)