INS Sumitra: సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారుల బోటు ‘MV ఇమాన్’ ను భారత యుద్ధ నౌక ‘INS సుమిత్ర’ రక్షించింది. ఆ బోటులోని 17 మంది సిబ్బందిని క్షేమంగా విడిపించింది. సముద్ర దొంగల నుంచి ఆయుధాలను లాక్కుని సోమాలియా దిశగా తరిమేసింది. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమైంది.
అంతకుముందు మత్స్యకారుల బోటు హైజాకైన ప్రాంతానికి INS సుమిత్ర చేరుకోగానే.. దానిలోని ‘ALH ధృవ్’ హెలిక్యాప్టర్లు బోటును చుట్టముట్టాయి. బోటును హైజాక్ చేసిన సముద్ర దొంగలను హెచ్చరించి లొంగదీశారు. అనంతరం దొంగల నుంచి ఆయుధాలను లాక్కుని సోమాలియా వైపు తరిమేశారు. బోటులోని 17 మంది సిబ్బంది క్షేమంగా విడిపించారు.
కేరళలోని కొచ్చి నగరానికి పశ్చిమంగా 700 నాటికల్ మైళ్ల దూరంలో ఆరేబియా సముద్రంలో సోమాలియా సముద్ర దొంగలు ఇరాన్కు చెందిన మత్స్యకారుల బోటు ‘MV ఇమాన్’ను హైజాక్ చేశారు. బోటులోని 17 మంది సిబ్బందిని తమ బందీలుగా చేసుకున్నారు. దాంతో INS సుమిత్ర ఘటనా ప్రాంతానికి వెళ్లి బోటులోని సిబ్బందిని రక్షించింది.