TS EAPCET | రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎప్సెట్ పరీక్షలు ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు శనివారం ఉదయం నిర్వహించిన సెషన్తో ఈ పరీక్షలు ముగిశాయి. కాగా, ఎప్సెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 25న కుదరకపోతే 27న ఫలితాలు విడుదల చేసేందుకు జేఎన్టీయూ అధికారుల సన్నాహకాలు చేస్తున్నారు.
టీఎస్ ఎప్ సెట్ పరీక్షలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ వారికి పరీక్షలను నిర్వహించారు.