Yashasvi Jaiswal | వెస్టిండీస్తో తొలి టెస్టు ద్వారా అంతర్జాతీయ అరంగేంట్రం చేసిన భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ప్రముఖులంతా ఈ చిచ్చిర పిడుగును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే యశస్వి జైస్వాల్ ఇంట్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈ స్థాయికి వచ్చిన తన కొడుకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో యశస్వి తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. టీమ్ఇండియా తరఫున తమ కుమారుడు అరంగేట్రం చేయడం జైస్వాల్ తండ్రి భూపేంద్ర జైస్వాల్.. కాలి నడకన కన్వర్ యాత్రకు బయల్దేరాడు. ఉత్తరప్రదేశ్లోని భదోహి నుంచి భుజాన గంగాజలాన్ని మోసుకుంటూ.. ఝార్ఖండ్లోని దేవ్గఢ్కు పయనమయ్యాడు. జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఈ యాత్ర ప్రారంభించడం గమనార్హం.
తమ కుమారుడు దేశానికి ఆడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నామని.. అది ఇప్పుడు నెరవేరిందని.. భూపేంద్ర జైస్వాల్ చెమర్చిన కండ్లతో చెప్పుకొచ్చాడు. ‘కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి ఓపెనింగ్ చేయడం చూసి కడుపు నిండిపోయింది. యశస్వి సాధించిన ఈ ఘనతతో కేవలం మా కుటుంబమే కాదు.. భదోహి జిల్లా వాసులంతా గర్వపడుతున్నాం. యశస్వి మరిన్న శతకాలు సాధించాలనే యాత్ర ప్రారంభించా’ అని సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక కెరీర్ ఆరంభంలో పానీపూరీలు అమ్మి పొట్ట పోసుకున్న యశస్వి.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఈ స్థాయికి చేరుకున్నాడు. దేశవాళీ, లిస్ట్-ఏ, రంజీ, ఐపీఎల్ ఇలా.. బరిలోకి దిగిన ప్రతి స్థాయిలోనూ సత్తాచాటిన యశస్వి.. జాతీయ జట్టు తరఫున కూడా ఇదే నిలకడ కొనసాగించాలని మనమూ కోరుకుందాం!
Read More: Asia cup 2023 | నాలుగు సరిపోవట.. మరిన్ని మ్యాచ్లకు అనుమతి కోరనున్న పాక్ క్రికెట్ బోర్డు
Yashasvi Jaiswal | ఆరంగ్రేటం టెస్టులోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు.. యశస్వీ ఏం అన్నాడంటే..?