Indian Grand Masters : స్పెయిన్లో టోర్నమెంట్కు ఆడేందుకు వెళ్లిన భారత చెస్ ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆరుగురు గ్రాండ్మాస్టర్లు(Grand Masters) బస చేసిన గదుల్లోకి చొరబడిన దొంగలు ల్యాప్టాప్(Laptop), పాస్పోర్టు (PassPort)లతో పాటు డబ్బులు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. రూమ్కి వచ్చి చూసే సరికి విలువైన వస్తువులేవీ లేకపోవడంతో భారత గ్రాండ్మాస్టర్లు పోలీసులను ఆశ్రయించారు. తమ వస్తువులు దొంగతనానికి గురైన విషయాన్ని దుష్యంత్ శర్మ(Dushyant Sharma) సోషల్మీడియా ద్వారా పంచుకున్నాడు.
సన్వే సిట్జెస్ చెస్ టోర్నమెంట్(Sunway Sitges Chess Tournament) ఆడేందుకు 70 మందితో కూడిన చెస్ బృందం స్పెయిన్కు వెళ్లింది. టోర్నీ జరిగే ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలోని అపార్ట్మెంట్లలో భారత ఆటగాళ్లకు నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు. అయితే.. గ్రాండ్మాస్టర్లు సంకల్ప్ గుప్తా(Sankalp Gupta), దుష్యంత్ శర్మ, మహిళల గ్రాండ్ మాస్టర్ శ్రీజ శేషాద్రి, మౌనికా అక్షయ, అర్పిత ముఖర్జీ, విశ్వ షా(Vishwa Shah)లు ఉంటున్న గదుల్లో దొంగలు బీభత్సం సృష్టించారు.
Burglary in #SPAIN #Sunway APOLO APARTMENT on 19 Dec in my room. My Laptop, Passport, cash etc & my roommate’s laptop,airpods stolen. Later on,similar thefts happened with other Indian chess players too. Requesting @SunwayChessOpen @IndiainSpain @ianuragthakur @DrSJaishankar Help pic.twitter.com/daKdjusy45
— Dushyant Sharma (@chess_dushyant) December 24, 2023
ఎవరూ లేని సమయంలో భారత ఆటగాళ్లు బస చేసిన గదులు తలుపులు పగులగొట్టిన దొంగలు.. ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో పాటు డబ్బులతో ఉడాయించారు. అక్కడ పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు మేము ఏమీ చేయలేమంటూ వెనక్కి పంపేశారు. దాంతో, ఎటూ పాలుపోని స్థితిలో ఆ ఆరుగరు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.