Chiranjeevi | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంటికి వెళ్లిన చిరు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గానూ కాంగ్రెస్ పార్టీకి, సీఎంకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సినిమా సహా రాష్ట్రంలోని పలు అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. కాగా, రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి ఆయన్ని కలవడం ఇదే తొలిసారి. చిరుతో భేటీకి సంబంధించిన ఫొటోలను రేవంత్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@KChiruTweets pic.twitter.com/RJD2R6m3Wl
— Revanth Reddy (@revanth_anumula) December 25, 2023
Also Read..
Praja Bhavan | ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన కారు..
AUS vs PAK | బాక్సింగ్ డే టెస్టుకు వర్షం అంతరాయం.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?