Afghanistan Cricket Board : ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్నద్ధమవుతున్న అఫ్గనిస్థాన్ క్రికెటర్ల(Afghanistan Cricketers)కు ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద షాకిచ్చింది. స్టార్ బౌలర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్(Mujeeb Ur Rahman), ఫజల్హక్ ఫారూఖీ(Fazalhaq Farooqi), నవీన్ ఉల్ హక్(Naveen Ul Haq)లకు ఎన్ఓసీ(No Objection Certificate) ఇవ్వకూడదని నిర్ణయించింది.
ఈ ముగ్గురికి దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనందున.. ఐపీఎల్తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్లో ఆడకుండా వీళ్లపై రెండేండ్ల పాటు నిషేధం విధించింది. ఏసీబీకి చెందిన ప్రత్యేక కమిటీ గతంలో ఈ ముగ్గురికి ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేసింది. అంతేకాదు ఈ ముగ్గురికి ఏడాది పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని డిసైడ్ అయింది.
🚨 ANNOUNCEMENT 🚨
The ACB has decided to delay the annual central contracts and opt not to grant NOCs to three national players, @Mujeeb_R88, @fazalfarooqi10 and Naveen Ul Haq.
Full Details 👉: https://t.co/FKECO8U7Ba pic.twitter.com/GMDaTzzNNP
— Afghanistan Cricket Board (@ACBofficials) December 25, 2023
‘ముజీబ్, ఫారుఖీ, నవీన్.. ఈ ముగ్గురికి దేశం కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యం అయ్యాయి. అందుకని వీళ్లు తమ పేర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం పరిశీలించ వద్దని క్రికెట్ బోర్డుకు తెలిపారు. అయితే.. 2024 జనవరి నుంచి దేశం తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నామని వాళ్లు చెప్పారు. కానీ వీళ్లకు ఒక ఏడాది పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చే ప్రసక్తే లేదు’ అని ఏసీబీ అధికారి ఒకరు వెల్లడించారు.
నవీన్ ఉల్ హక్
ఐపీఎల్లో ముజీబ్ కోల్కతా నైట్ రైడర్స్కు, ఫారూఖీ సన్రైజర్స్ హైదరాబాద్కు, నవీన్ లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లతో పాటు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఆడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ముగిసన అనంతరం 50 ఓవర్ల ఫార్మాట్కు నవీన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతడితో పాటు ముజీబ్, ఫారూఖీ కూడా టీ20 లీగ్స్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురికి ఈసారి ఎన్ ఓసీ ఇవ్వకూడనది నిర్ణయం తీసుకుంది.