Team India Jersey | ముంబై: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్ 1 నుంచి జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. అధికారిక కిట్ స్పాన్సర్ అయిన అడిడాస్..ధర్మశాల స్టేడియం బ్యాక్డ్రాప్తో రోహిత్శర్మ, జడేజా, కుల్దీప్యాదవ్ కనిపిస్తున్న ఓ వీడియోను ‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్తో సోమవారం విడుదల చేసింది.
నారిం జ, నీలం రంగుల కలయికతో కూడిన జెర్సీకి వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే దీనిపై అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీని పోలి ఉందని కొందరు అంటే బీజేపీ పార్టీ రంగుల్లో ఉందని కొందరు విమర్శలకు దిగారు.