ముంబై: ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించడం కష్టమే. అయితే సోమవారం హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించిన విషయం తెలిసిందే. జూన్ ఒకటి నుంచి ప్రారంభంకానున్న వరల్డ్కప్ నేపథ్యంలో మిగిలిన రెండు మ్యాచుల్లో బుమ్రాను ఆడిపిస్తారా లేదా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలాగో ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అవకాశాలు లేవు కాబట్టి.. వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు రెస్ట్ ఇస్తారా అని ప్రశ్నలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్(Kieron Pollard) దీనిపై రియాక్ట్ అయ్యారు.
ఈ అంశం గురించి తాము ఏమీ ఆలోచించలేదన్నారు. కానీ ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ ఆటపైనే దృష్టి పెట్టామన్నారు. ఇప్పుడే వరల్డ్కప్ గురించి ఆలోచిస్తే, అప్పుడు ఈ టోర్నీలో రాణించలేమని పోలార్డ్ తెలిపారు. ప్రస్తుతం తమ క్యాంపులో ఐపీఎల్పైనే ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఐపీఎల్ జట్టును వదిలి, భారత జట్టును చేరినప్పుడు బుమ్రా ఆ దిశగా శిక్షణ పొందుతాడన్నారు. మే 17వ తేదీన ముంబై జట్టు తన చివరి మ్యాచ్ను లక్నోతో ఆడనున్నది.