Sachin Tendulkar | ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాంద్రాలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గర భారీ శబ్దాలు వస్తున్నాయంటూ దిలీప్ డిసౌజా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాత్రి సమయంలో సిమెంట్ మిక్సింగ్ వాహనాలతో ఇబ్బంది అవుతుందంటూ తాను ఎదుర్కొంటున్న సమస్యను సచిన్ను ట్యాగ్ చేస్తూ డిసౌజా సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ విషయంలో మీరు(సచిన్) కలుగజేసుకుని పరిష్కారించాలంటూ డిసౌజా ట్వీట్ చేశాడు. ఇది కొన్ని గంట ల వ్యవధిలోనే ఐదు లక్షల వ్యూస్కు తోడు 500 రీట్వీట్లు వచ్చాయి. క్రికెట్ ఐకాన్ పట్ల డిసౌజా వ్యవహరించిన తీరును సోషల్మీడియాలో చాలా మంది విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఈ విషయంలో మీరు పోలీసులను సంప్రదించాల్సిందని ఒకరు అంటే…బీఎమ్సీ నిబంధనల ప్రకారమే నిర్మాణం జరుగుతుందని మరొకరు రాసుకొచ్చారు.