న్యూఢిల్లీ : ఒలింపిక్స్ చరిత్రలో 121 ఏండ్ల కలను సాకారం చేసి భళా అనిపించుకున్నాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Food). శరీరం బరువు తగ్గించుకొనేందుకు ఆటల్లోకి వచ్చిన నీరజ్.. ఇదే ఆటల్లో తానేంటో నిరూపించుకుని భారతదేశం పేరు, ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పారు. శనివారం సాయంత్రం జరిగిన ఈవెంట్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అయితే, ఈ 23 ఏండ్ల కుర్రోడికి బ్రెడ్ అమ్లెట్ అన్నా, గోల్గప్పాలు లాగించడమన్నా చాలా ఇష్టమంట.
ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు స్వీట్లు అంటే ప్రాణం. ఒలింపిక్స్ ముగియగానే మిఠాయిలు తింటానని ఇదివరకే చెప్పాడు. అయితే, తనకు ఇష్టమైన ఆహారాల గురించి ఒలింపిక్స్కు వెళ్లడానికి ముందు ఆయన మీడియాతో పంచుకున్నాడు. తనకు బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఎంతో ఇష్టమని, వారం రోజులు ఏ సమయంలోనైనా బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతానని చెప్పాడు. తన కోసం సాల్టెడ్ రైస్ వండుకుంటాడు. టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తింటాడు. ప్రాక్టీస్ చేసేప్పుడు మాత్రం పండ్లరసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే.. అక్కడ దొరికే ఆహారాలను తీసుకుంటాడు. ఇటీవలనే తన డైట్లోకి సాల్మన్ చేపలను చేర్చుకున్నాడు. గోల్గప్పాలు తినడం అంటే అమితమైన ఇష్టమంట. గోల్గప్పాలో ఎక్కువగా నీరే ఉంటున్నందున, వీటి వల్ల ఆటగాళ్లకు ఎలాంటి అపాయం ఉండదని చెప్పాడు.
టోక్యో రైలులో కత్తిపోట్లు.. 10 మందికి గాయాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బంపర్ లాభం
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
కుంభమేళాలో నకిలీ కొవిడ్ పరీక్షలు.. ఈడీ తనిఖీలు
హక్కులు-బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: వెంకయ్య
జరాంజ్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..