న్యూఢిల్లీ : పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని గుర్తుచేశారు. జాతీయవాది చమన్లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చమన్లాల్ సేవలను కొనియాడారు.
స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, తదనంతర ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ చమన్లాల్ జీ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను మాతృదేశంతో అనుసంధానమయ్యేలా, వారిలో జాతీయతాభావం పెంపొందేలా విశేష కృషిచేశారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వెనక్కు తగ్గకుండా జైలుపాలైన జాతీయవాదుల కుటుంబాలను నిరంతరం పరామర్శిస్తూ వారిలో ధైర్యాన్ని నింపారన్నారు. చమన్లాల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు, పాతతరం అనుభవానికి కొత్తతరం ఆలోచనలు తోడైతేనే పురోగతి సాధ్యమని నమ్మేవారని చెప్పారు. విశ్వ అధ్యయన కేంద్రం ఏర్పాటులో చమన్లాల్ జీ కీలక పాత్ర పోషించారని, ప్రపంచవ్యాప్తంగా భారతీయతను ప్రతిబింబించే అంశంలో విశ్వ అధ్యయన కేంద్రం చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్, పలువురు పార్లమెంటు సభ్యులు, తపాలా శాఖ అధికారులు, విశ్వ అధ్యయన కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.
జరాంజ్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
కలోంజితో కరోనా ఇన్ఫెక్షన్కు చెక్..?!
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..