కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మెల్లమెల్లగా తమ పట్టును పెంచుకుంటున్నారు. అమెరికా సేనలు అఫ్ఘాన్ గడ్డ మీది నుంచి వైదొలగుతుండటంతో.. తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఒక్కో ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి (Talibans Capture) తీసుకుంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తాజాగా అఫ్ఘాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న జరాంజ్ నగరాన్ని హస్తగతం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలోని ప్రావిన్స్ నిమ్రుజ్ రాజధాని జరాంజ్. ఈ విషయాన్ని అఫ్ఘాన్ అధికారులు ధ్రువీకరించారు.
గత కొన్ని రోజులుగా ఆఫ్ఘాన్ సైన్యంతో పోరాటం చేస్తున్న తాలిబాన్లు.. ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే పలు నగరాలు, పట్టణాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. ఆఫ్ఘాన్ సైన్యానికి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. జరాంజ్తోపాటు లష్కర్ గాహ్ నగరాల రక్షణ బాధ్యత 215 అఫ్ఘాన్ నేషనల్ ఆర్మీ కార్ప్స్ది. జరాంజ్ను స్వాధీనం చేసుకోవడంతో ఆర్మీ లష్కర్ గాహ్పై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తున్నది.
నిమ్రుజ్ రాజధాని అయిన జరాంజ్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని నిమ్రుజ్ డిప్యూటీ గవర్నర్ రోహుల్ ఖైర్జాద్ తెలిపారు. తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న తొలి ప్రాంతీయ రాజధాని ఇదేనని ఆఫ్ఘాన్ అధికారులు చెప్పారు. తాలిబాన్లు ఇలాంటి అనేక నగరాలను చుట్టుముట్టింది. 1.60 లక్షల జనాభాతో ఉన్న జరాంజ్ నగరాన్ని హస్తగతం చేసుకోవడం తాలిబాన్ మొదటి ప్రధాన విజయంగా ఆఫ్ఘాన్ రాజకీయ నిపుణులు చెప్తున్నారు.
షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
కలోంజితో కరోనా ఇన్ఫెక్షన్కు చెక్..?!
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..