డెహ్రాడూన్ : హరిద్వార్లో ఏప్రిల్ నెలలో నిర్వహించిన కుంభమేళా సందర్భంగా నకిలీ కొవిడ్ పరీక్షలు (Fake Testings) జరిపారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం ఉత్తరాఖండ్లోని పలు ల్యాబ్ల్లో చేపట్టిన తనిఖీలు.. ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. పలువురు ఉన్నతాధికారుల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు డయగ్నోస్టిక్ సంస్థల్లో తనిఖీలు జరిపారు. ఇక్కడి నుంచి రూ.30.9 లక్షల నగదుతోపాటు నకిలీ బిల్లులు, ల్యాప్టాప్లు, మొబైల్స్, భూ లావాదేవీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈడీ తనిఖీలు చేసిన కంపెనీలలో నోవస్ పాత్ ల్యాబ్స్, డీఎన్ఏ ల్యాబ్స్, మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్, డాక్టర్ లాల్చందానీ ల్యాబ్స్, నల్వ లాబొరేటరీస్ ఉన్నాయి. డెహ్రాడూన్, హరిద్వార్, ఢిల్లీ, నోయిడా, హిసార్లో సోదాలు చేపట్టారు. కుంభమేళా సమయంలో యాంటిజెన్, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు ల్యాబ్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే, వీరు పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా నమోదు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ల్యాబ్లు ఇచ్చిన జాబితాలో చాలా పేర్లు నకిలీవిగా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కుంభమేళాకు వెళ్లనప్పటికీ హరిద్వార్లో కొవిడ్ పరీక్షలు జరిపినట్లు తన మొబైల్ మెసేజ్ వచ్చిందని పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో భాగోతం బయటకు వచ్చింది. ఉత్తరాఖండ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఆయా ల్యాబ్లు అందించిన జాబితాలో ఒకే ఫోన్ నంబర్లు, నకిలీ ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఉన్నాయని తేల్చిన ఈడీ.. లెక్కకు మిక్కిలి మందికి కరోనా పరీక్షలు చేసినట్లు గుర్తించింది. వాస్తవానికి హరిద్వార్లో 5.3 శాతం పాజిటివిటీగా ఉండగా.. ఈ ల్యాబ్లు నకిలీ పరీక్షల నివేదికలతో 0.18 శాతంగా పాజిటీవ్ రేటు కనిపించింది. ఈ ల్యాబ్లకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.3.4 కోట్ల నిధులు విడుదల చేసింది.
హక్కులు-బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: వెంకయ్య
జరాంజ్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
కలోంజితో కరోనా ఇన్ఫెక్షన్కు చెక్..?!
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..