టోక్యో : ఒలింపిక్స్ జరుగుతున్న జపాన్ రాజధాని టోక్యో పట్టణంలో కత్తిపోటు (Attack in Train) ఘటన కలకలం రేపింది. ప్యాసింజర్ల రైలులో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో కనీసం 10 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిని 36 ఏండ్ల యూసుకే సుషిమాగా గుర్తించారు. ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.
టోక్యోలోని సిజోగాకున్ రైల్వే స్టేషన్లో యూసుకే సుషిమా అనే వ్యక్తి ప్యాసింజర్లపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు చెప్పారు. కత్తితో దాడి చేసిన తర్వాత రైలును అత్యవసరంగా నిలిపివేసి దూకి పారిపోయాడు. అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను తదుపరి స్టేషన్లో దింపి దవాఖానకు తరలించారు. రైలులో ఒక మహిళ నవ్వుతూ కనిపించగానే కోపం పట్టలేక కత్తితో దాడి చేసినట్లు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
టోక్యోలో ప్రస్తుతం ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కత్తిపోటు సంఘటన జపాన్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తింది. జపాన్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది. అయితే గత కొన్నేండ్లుగా ఇక్కడ అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. 2019 లో ఒక వ్యక్తి పాఠశాల పిల్లలపై దాడి చేసిన ఘటనలో ఒక చిన్నారి చనిపోగా, 18 మంది గాయపడ్డారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బంపర్ లాభం
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
కుంభమేళాలో నకిలీ కొవిడ్ పరీక్షలు.. ఈడీ తనిఖీలు
హక్కులు-బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: వెంకయ్య
జరాంజ్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..