Ambedkar Jayanti : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తోపాటు మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
జై భీమ్ ✊
జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్✊తెలంగాణ భవన్ లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, పాల్గొన్న మాజీ మంత్రులు… pic.twitter.com/QvMl8jCwHn
— BRS Party (@BRSparty) April 14, 2026