న్యూఢిల్లీ, ఆగస్టు 10: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత త్రివర్ణ పతకాన్ని చేతిలో పట్టుకొని ప్రేమను చాటుకున్నారు. భారత్-రష్యా స్నేహాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు. భారత్కు అభినందనలు తెలియజేశారు. త్రివర్ణ పతకాన్ని పట్టుకున్న వ్యోమగామి ఆండ్రీ ఫెడ్యాయేవ్..‘భారత్-రష్యా స్నేహం వర్ధిల్లాలి’ అని అన్నారు. మాస్కో-న్యూఢిల్లీ మధ్య సుదీర్ఘ సహకార సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన ఒక కీలకమైనదిగా వారు అభివర్ణించారు. భారత ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలుగాలని రష్యన్ వ్యోమగామి ప్యోటర్ డుబ్రోవ్ ఆకాంక్షించారు. 1975లో ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగంతో మొదలై గగన్యాన్ వరకు దశాబ్దాలపాటు సాగిన ఇరు దేశాల అంతరిక్ష సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.