న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మార్చివేసే దిశగా రాబోయే రెండేండ్లలో ‘ఈవీటీవోఎల్’ ఎయిర్ ట్యాక్సీలను ఆపరేట్ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ‘సార్లా ఏవియేషన్’ సంస్థకు మూడో ‘ఈవీటీవోఎల్ డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్'(డీవోఏ) ను అందజేశారు.ఈవీటీవోఎల్ విమానాలు సాధారణ విమానాల మాదిరిగా కాకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి అనువైన సాంకేతికతను కలిగివుంటాయి. రన్వే అవసరం ఉండదు. సులభంగా బయలుదేరడానికి, పరిమిత స్థలంలో దిగడానికి వీలు కల్పిస్తుంది. ఎయిర్ ట్యాక్సీ సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది.