ముంబై : జూన్ త్రైమాసికం ఫలితాలను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) (Bank of Baroda) విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ నష్టాల నుంచి లాభాలను పొందింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.864 కోట్ల నష్టంతో పోలిస్తే.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు బ్యాంక్ రూ.1,208 కోట్ల లాభాన్ని అందుకున్నది. వడ్డీ ఆదాయాలు (ఎన్ఐఐ) 15.7 శాతం పెరిగాయి. ఇది జూన్ త్రైమాసికంలో రూ.7,892 కోట్లుగా ఉన్నది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.6816 కోట్లుగా ఉన్నది. ఎన్పీఏలలో స్వల్ప క్షీణత కనిపించింది.
బ్యాంకు నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్ఎన్పీఏ) మార్చి త్రైమాసికంలో 3.09 శాతంతో పోలిస్తే 3.03 శాతంగా ఉన్నాయి. మరోవైపు, గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (జీఎన్పీఏ) 8.86 శాతంగా ఉండగా.. మార్చి త్రైమాసికంలో 8.87 శాతంగా నమోదయ్యాయి. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ల ప్రకారం, ఆర్గానిక్ రిటైల్ లోన్స్ 11.8 శాతం పెరిగాయి. వాహన రుణాలలో 25 శాతం, వ్యక్తిగత రుణాలలో 19.5 శాతం పెరుగుదల ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో 1.27 శాతం పెరిగి రూ.83.50 వద్ద ముగిశాయి.
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
కుంభమేళాలో నకిలీ కొవిడ్ పరీక్షలు.. ఈడీ తనిఖీలు
హక్కులు-బాధ్యతల మధ్య సమన్వయం అవసరం: వెంకయ్య
జరాంజ్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు
షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవాలా..? ఈ ఆహారాలను ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..