BCCI : భారత జట్టు మరో వారంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్ వచ్చేసింది. అయితే.. టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో… భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పురుషుల జట్టు ఒక్క సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించింది. చేతన్ శర్మ(Chetan Sharma) ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో అప్పటి నుంచి చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. సభ్యులలో ఒకరైన శివసుందర్ దాస్(Shiv Sundar Das) తాత్కాలికగా చైర్మన్గా కొనసాగుతున్నాడు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. అయితే.. చైర్మన్ పదివి కోసం మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) పోటీలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ తాను పోటీలో ఉన్నానని వీరూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీలో శివ సుందర్ దాస్(Shiv Sundar Das), సుబ్రతో బెనర్జీ(Subroto Banerjee), సలీల్ అంకోలా(Salil Ankola), శ్రీధరన్ శరత్(Sridharan Sharath) సభ్యులుగా ఉన్నారు.
🚨 NEWS 🚨
BCCI invites applications for one member of Men’s Selection Committee post.
Details 🔽https://t.co/jOU7ZIwdsl
— BCCI (@BCCI) June 22, 2023
సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసేవాళ్లకు ఉండాల్సిన అర్హతలు – కనీసం ఏడు టెస్టు మ్యాచ్లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండాలి. లేదంటే 10 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడినా సరిపోతుది. అంతేకాదు.. గడువు తేదీ వరకు దరఖాస్తుదారులు ఆటకు వీడ్కోలు పలికి ఐదేళ్లు మించకూడదు. అలాగే.. బీసీసీఐ నియమావళి ప్రకారం వాళ్లు మరే ఇతర క్రికెట్ కమిటీలోనూ 5 ఏళ్లకు మించి సభ్యులుగా ఉండకూడదు. రెండు రోజుల క్రితమే మహిళల సీనియర్, జూనియర్ జట్లకు సెలెక్టర్లుగా ఎంపిక చేసింది. నీతూ డేవిడ్(Neetu David) ఆధ్వర్యంలోని బృందం మాజీ క్రికెటర్ శ్యామా దే షా(Shyama Dey Shaw)ను సీనియర్ జట్టుకు సెలెక్టర్గా, జూనియర్ జట్టు సెలెక్షన్ కమిటీకి చీఫ్గా వీఎస్ తిలక్ నాయుడు(VS Thilak Naidu)ను నియమించింది.