BCCI : భారత క్రికెటర్లకు సకల హంగులతో కూడిన జాతీయ క్రికెట్ అకాడమీ(National Cricket Academy) అందుబాటులోకి రానుంది. బెంగళూరులో కొత్తగా నిర్మించిన అకాడమీ దాదాపు పూర్తి కావొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతుతున్న ఈ క్రికెట్ అకాడమీ విశేషాలు, ఫొటోలను శనివారం బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) అభిమానులతో పంచుకున్నాడు. ఎక్స్ ఖాతాలో షా కొత్త క్రికెట్ అకాడమీకి సంబంధించిన ప్రత్యేకతలను ప్రస్తావించాడు.
‘కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు వచ్చిందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే బెంగళూరులో ఈ అకాడమీని ప్రారంభించనున్నాం. ఈ కొత్త ఎన్సీఏలో మూడు ప్రపంచ స్థాయి మైదానాలు, 45 ప్రాక్టిస్ పిచ్లు, ఇండోర్ క్రికెట్ పిచ్లు, ఒలింపిక్ పోటీల్లో ఉపయోగించేంతటి పెద్ద పరిమాణంలోని ఈత కొలను ఉన్నాయి.
Very excited to announce that the @BCCI’s new National Cricket Academy (NCA) is almost complete and will be opening shortly in Bengaluru. The new NCA will feature three world-class playing grounds, 45 practice pitches, indoor cricket pitches, Olympic-size swimming pool and… pic.twitter.com/rHQPHxF6Y4
— Jay Shah (@JayShah) August 3, 2024
ఇవే కాకుండా ఆర్ట్ ట్రైనింగ్, ఆటగాళ్ల చికిత్స, స్పోర్ట్స్ సైన్స్కు సంబంధించిన సకల వసతులు ఉన్నాయి. భారత క్రికెటర్లు, భావి ఆటగాళ్లు ఒక సకల సౌకర్యాలతో కూడిన వాతావరణంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు మా ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని మేము భావిస్తున్నా’ అని షా వెల్లడించాడు.