BCCI : భారత క్రికెట్ బోర్డు మరోసారి భారీ ఆదాయంపై కన్నేసింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్(Title Sponsor Rights)కు బీసీసీఐ ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జీఎస్టీతో కలిపి రూ. లక్ష చెల్లించిన వాళ్లకు మాత్రమే ఇన్విటేషన్ టు టెండర్(Invitation to Tender) ఫామ్ ఓపెన్ అవుతుందని వెల్లడించింది.
ఒకవేళ టెండర్ దక్కకుంటే కట్టిన డబ్బులు వాపసు ఇవ్వబోమని, ఈ టెండర్ దరఖాస్తు ఆగస్టు 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని నోటిఫికేషన్లో బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. ఆసక్తికల కంపెనీలు పేమెంట్ వివరాలను titlesponsor.itt@bcci.tv మెయిల్కు చేయాలని సూచించింది. స్పాన్సర్షిప్ దక్కించుకున్న కంపెనీ ఇకనుంచి బీసీసీఐ అన్ని కార్యక్రమాలకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుంది.
🚨BCCI announces the release of Invitation to Tender for Title Sponsor Rights for BCCI Events🚨
The ITT will be available for purchase till August 21, 2023.
More details here 👇https://t.co/AgJYpPPuj0
— BCCI (@BCCI) August 1, 2023
ఈమధ్యే భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులను డ్రీమ్ 11(Dream 11) సంస్థకు కట్టబెట్టింది. అంతుకుమందు పదహారోసీజన్ ఐపీఎల్(IPL 2023) టైటిల్ స్పాన్సర్షిప్ను టాటా గ్రూప్(TATA Group)కి కట్టబెట్టడం , తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premiere League) మీడియా హక్కులను వైకోమ్ సంస్థ(VI COM)కు అమ్మడం ద్వారా బీసీసీఐకి కోట్లలో ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.
మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణలో ఐదు జట్ల కెప్టెన్లు
తాజాగా జారీ చేసిన టైటిల్ స్పాన్సర్ రైట్స్ టెండర్తో ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డుకు కోట్లలో డబ్బులు సమకూరనున్నాయి. వారం క్రితమే బీసీసీఐ టీమిండియా 203-24 షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది భారత జట్టు సొంతగడ్డపై 16 మ్యాచ్లు ఆడనుంది. వాటిలో ఐదు టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయి.