Women’s IPL | చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్కు వేళయింది. లీగ్ పేరుతో పాటు ప్రాంఛైజీల వివరాలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మహిళల ఐపీఎల్కు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL )గా పేరు ఖరారు చేశారు. దీంతో పాటు డబ్ల్యూపీఎల్లోని ఐదు ఫ్రాంచైజీల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ ఐదు ప్రాంచైజీలకు నిర్వహించిన వేలం పాటలో రూ.4,669.99 కోట్ల ఆదాయం వచ్చినట్టు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ఇది 2008లో ప్రారంభమైన మెన్స్ ఐపీఎల్ జట్ల కోసం నిర్వహించిన బిడ్ల కంటే కూడా ఎక్కువ అని జై షా వెల్లడించారు. ఇంతలా వచ్చిన ఆదరణ చూస్తుంటే మహిళల క్రికెట్లో విప్లవానికి డబ్ల్యూపీఎల్ నాంది పలుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళల ప్రీమియర్ లీగ్లో ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు 30 కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డాయి. ఈ పోటీలో అహ్మదాబాద్ జట్టును సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్నకు చెందిన అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేటు లిమిటెడ్ అత్యధికంగా రూ.1,289 కోట్లు వెచ్చింది. ఇక ముంబై ఫ్రాంచైజీని రిలయన్స్ సంస్థలో భాగమైన ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సొంతం చేసుకుంది. దీనికోసం రూ.912.99 కోట్లు వెచ్చించింది.
ఫ్రాంచైజీ |
|
ధర |
|
అహ్మదాబాద్ | అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేటు లిమిటెడ్ | 1289 కోట్లు | |
ముంబై | ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ | 912.99 కోట్లు | |
బెంగళూరు | రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ | 901 కోట్లు | |
ఢిల్లీ | జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేటు లిమిటెడ్ | 810 కోట్లు | |
లక్నో | క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ | 757 కోట్లు |
ఆ సెంచరీతో మా నాన్న సంతోషపడకపోవచ్చు.. శుభ్మాన్ గిల్ సరదా కామెంట్