Tokyo Olympics 2020 | టోక్యో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ( PV Sindhu ) చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్లో గెలిచి కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది.
‘ఇన్నేండ్లుగా పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నన్నుచాలా ఎమోషన్స్ వెంటాడుతున్నాయి. కాంస్య పతకం గెలిచినందుకు సంతోషించాలో.. ఫైనల్లో ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్ ఆడే సమయంలో నా భావోద్వేగాలు అన్నింటినీ పక్కనపెట్టేసి.. నా శాయశక్తుల ఆడాను. ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి మెడల్ సాధించిపెట్టినందుకు గర్వపడుతున్నా’ అంటూ పీవీ సింధు చెప్పుకొచ్చింది. తనపై ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పింది.
ఒలింపిక్స్లో గెలవడం పట్ల చాలా సంతోషంగా ఉందని.. ఈ మధుర క్షణాలను చాలా ఎంజాయి చేస్తున్నానని పీవీ సింధు తెలిపింది. తన గెలుపు కోసం కుటుంబసభ్యులు ఎంతో కష్టపడ్డారని పేర్కొంది. అలాగే స్పాన్సర్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారని చెప్పింది. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఇవాళ బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన పోటీ గురించి చెబుతూ.. నిన్నటి మ్యాచ్లో మేమిద్దరం ( సింధు, హి బింగ్జియా ) ఇద్దరం ఓడిపోయాం. మా ఇద్దరికీ ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. దేశం కోసం మెడల్ గెలవాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఇలాంటి సమయంలో పోరాడటం అంత సులువు కాదు. చాలా పెద్ద విషయం. ఈ మ్యాచ్లో గెలవడం కోసం చాలా ఓపిగ్గా ఉన్నా. ఆధిక్యంలో ఉన్నప్పటికీ విశ్రమించలేదు. అని చెప్పుకొచ్చింది. అలాగే 2024లో పారిస్లో జరగబోయే ఒలింపిక్స్లోనూ కచ్చితంగా పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
PV Sindhu: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్
PV Sindhu: నా కోసం మెడల్ గెలవమని చెప్పాను: సింధు తండ్రి రమణ
Hockey: ఇండియన్ హాకీ టీమ్ సంచలనం.. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీస్లోకి..
Women Power : టోక్యో ఒలింపిక్స్లో రాణులదే హవా..!