టోక్యో: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండు ఒలింపిక్ మెడల్స్తో చరిత్ర సృష్టించిన సంగతి తెలుసు కదా. ఇంతటి ఘనత సాధించిన తమ కూతురిని చూసి సింధు తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగుతున్నారు. సింధు విజయంపై ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. కోచ్ పార్క్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆమె కోసం అతడు ఎంతో చేశాడు. ఒలింపిక్ అసోసియేషన్, ప్రభుత్వం, మీడియా, స్పాన్సర్లకు కృతజ్ఞతలు. ఆమె దేశం కోసం మెడల్ సాధించడం, అందులోనూ ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలవడం సంతోషంగా ఉంది అని రమణ అన్నారు.
శనివారం సెమీస్ మ్యాచ్లో ఓడిన తర్వాత తాను సింధుతో మాట్లాడానని చెప్పారు. నిన్న ఆమెతో మాట్లాడాను. గెలవమని చెప్పాను. నా కోసం గెలవమని చెప్పాను. ఆమె కంట్లో నీళ్లు చూశాను. అయితే ఆమె ప్రత్యర్థి బింగ్జియావో సుదీర్ఘ గేమ్స్ ఆడుతోందని, ఆమె ఎక్కువసేపు ఆడలేదని చెప్పాను. విశ్లేషణ కోసం ఆమెకు వీడియోలు కూడా పంపించాను అని రమణ తెలిపారు. ఈ నెల 3న సింధు తిరిగి హైదరాబాద్కు రానుంది. ఆమె వచ్చే ఒలింపిక్స్ కూడా ఆడుతుందన్న నమ్మకం తనకు ఉందని రమణ అన్నారు.