టోక్యో: ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో మణ్ప్రీత్ సింగ్ సేన 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్పై విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించినా.. తర్వాత కళ తప్పిన భారత హాకీ.. ఈసారి అద్భుతమే చేసింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న మన టీమ్.. లీగ్ స్టేజ్లో 5 మ్యాచ్లకు గాను 4 గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా తరఫున దిల్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, గుర్జిత్ సింగ్ గోల్స్ చేశారు. తొలి హాఫ్ ముగిసే సరికే 2-0 గోల్స్తో లీడ్లో ఉన్న భారత్.. చివరి నిమిషాల్లో మరో గోల్ చేసింది. అంతకుముందే ఓ గోల్ చేసిన బ్రిటన్.. ఇండియా ఆధిక్యాన్ని కాస్త తగ్గించింది.