రెండేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్కు ముహూర్తం ఖరారైంది. 2018లో చివరగా జరిగిన ఈ టోర్నీ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో రద్దయింది. 2021లో కరోనాతోపాటు, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండటంతో ఈ టోర్నీ జరగలేదు. ఈ ఏడాది మాత్రం ఆసియా కప్ జరగబోతోంది.
అయితే ఎప్పట్లా వన్డే ఫార్మాట్లో కాకుండా ఈసారి ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నట్లు ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 20 నుంచి ఆసియా కప్ క్వాలిఫైయర్లు మొదలవుతాయని.. ప్రధాన టోర్నీ ఆగస్టు 27వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఏసీసీ వెల్లడించింది.
శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ జరగనుంది. అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. దానికి ముందే మరోసారి భారత్-పాక్ మ్యాచ్ చూసే అవకాశం ఆసియా కప్ వల్ల అభిమానులకు కలగనుంది.
ఇదిలా వుండగా, ఏసీసీ అధ్యక్షుడిగా బీసీసీఐ సెక్రటరీ జై షా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. షా పదవీకాలన్ని పొడిగించాలని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. ఏసీసీ ప్రెసిడెంట్గా జై షా, ఆయన కార్యవర్గం 2024 వరకు కొనసాగుతుందని ఈ కౌన్సిల్ వెల్లడించింది.
The Asia Cup 2022 (T20 Format) will be held in Sri Lanka from 27 August – 11 September later this year. The Qualifiers for the same will be played 20 August 2022 onwards.
— AsianCricketCouncil (@ACCMedia1) March 19, 2022