Swati Maliwal : బీజేపీ పన్నిన కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్పై స్వాతిమాలివాల్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆప్ ప్రకటించడంపై ఆమె స్పందించారు. పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వాళ్లు 20 ఏళ్ల కార్యకర్తనైన తనపై బీజేపీ ఏజెంట్గా ముద్ర వేశారని స్వాతి మాలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ప్రెస్మీట్లో నిజాన్ని అంగీకరించిన పార్టీ.. ఇవాళ యూ టర్న్ తీసుకుందని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ మేరకు హిందీలో ఆమె ఒక పోస్టు పెట్టారు.
దీనికంతటికీ కారణం ఆ గూండానే అని విభవ్ కుమార్ను ఉద్దేశించి స్వాతి మాలివాల్ మండిపడ్డారు. తాను అరెస్టయితే ‘పార్టీ సీక్రెట్స్ అన్నీ బయటపెడుతా’ అని ఆ గూండా బెదిరిస్తున్నాడని, అందుకే పార్టీ ఇవాళ మార్చిందని ఆరోపించారు. ఆరెస్టుకు భయపడే ఆ గూండా షెల్టర్ కోసం లక్నో చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించారు. ఆ గూండా ఒత్తిడితోనే పార్టీలోని నేతలంతా ఇవాళ తన క్యారెక్టర్ను హత్య చేస్తున్నారని అన్నారు.
అయినా పర్వాలేదని తాను ఒంటరిగా పోరాటం చేస్తానని స్వాతి మాలివాల్ చెప్పారు. తన కోసం పోరాడుతూనే దేశంలోని మహిళలందరి తరఫున పోరాటం చేస్తానని అన్నారు. తనను ఎంత కించపర్చదల్చుకున్నారో అంత చేయండని, సమయం వచ్చినప్పుడు నిజం అదే బయటికి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
AAP Rajya Sabha MP Swati Maliwal tweets, ” The leaders who joined the party yesterday declared a 20-year-old worker as a BJP agent. Two days ago the party had accepted the truth in the PC and today it has taken a U-turn This goon is threatening the party, if I get arrested I… pic.twitter.com/8of4v6zdQY
— ANI (@ANI) May 17, 2024