Air India | న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం సాయంత్రం తిరిగి దేశ రాజధానికి వచ్చేసింది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఎయిర్ కండిషనింగ్ యూనిట్లో మంటలు చెలరేగాయని సందేహాలు రావడంతో తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.
విమానం టేకాఫ్ తీసుకోగానే ఎయిర్ కండిషనింగ్ యూనిట్లో మంటలు చెలరేగాయన్న అనుమానాల మధ్య ఎమర్జెన్సీ ప్రకటించినట్లు అధికార వర్గాల కథనం. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని సురక్షితంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అందులో ప్రయాణిస్తున్న వారు బెంగళూరు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించాయి.