IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) జట్టు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్లో లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్(38), ఓలీ పోప్(16) క్రీజులో ఉన్నారు. బెన్ స్టోక్స్ సేన ఇంకా 101 పరుగులు వెనకబడి ఉంది.
భారత ఇన్నింగ్స్ ముగిశాక క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే(31) బజ్ బాల్ ఆటతో విరుచుకుపడ్డారు. అయితే.. అశ్విన్ సూపర్ డెలివరీతో క్రాలేను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన పోప్ జాగ్రత్తగా ఆడాడు. డకెట్తో కలిసి రెండో వికెట్కు 44 పరుగులు చేశాడు.
Ashwin gets Crawley, but England’s intent is showing – the morning session goes to the visitors 👌 #INDvENG
▶️ https://t.co/WzuwYpQAGX pic.twitter.com/Pq5aj3hnwo
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2024
తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు(Team India) తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులకు ఆలౌటయ్యింది. మూడో రోజు తొలి సెషన్లో పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో భారత్ను దెబ్బకొట్టాడు. దాంతో, రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
Four wickets for England’s ‘fourth-choice’ spinner #INDvENG
▶️ https://t.co/WzuwYpQAGX pic.twitter.com/MPZCoBIzPj
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2024
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(87: 180 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)ను ఎల్బీగా వెనక్కి పంపిన రూట్.. ఆ తర్వాతి బంతికే కొత్త బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా(0)ను బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ బంతిని సిరాజ్ అడ్డుకున్నాడు. కానీ, రెహాన్ అహ్మద్ బౌలింగ్లో అక్షర్ పటేల్(44) బౌల్డ్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది.