న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson)కు జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సమయంలో ఆన్ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన శాంసన్కు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ వేశారు. డీప్ మిడ్వికెట్లో షాయ్ హోప్ తన క్యాచ్ అందుకున్న వివాదంలో సంజూ అంపైర్లను నిలదీశారు. థార్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని డీసీకి ఫేవర్గా ఇవ్వడం పట్ల సంజూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ అఫీషియల్స్తో మాటల యుద్ధానికి దిగాడు. అయితే ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సంజూకు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రటకనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 కింద లెవల్ వన్ నేరానికి శాంసన్ పాల్పడినట్లు ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ రిఫరీ నిర్ణయమే శిరోధార్యమని ఆ ప్రకటనలో చెప్పారు. ఈ మ్యాచ్లో శాంసన్ 86 రన్స్ చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు.