ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశం తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ చివరికొచ్చేసిందని హంగేరిలోని భారత ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంబసీ.. ‘ఆపరేషన్ గంగకు చెందిన చివరి బ్యాచ్ విమానాలు ఇవాళ వెళ్లిపోతాయి. భారతీయ విద్యార్థులు బుడాపెస్ట్ చేరుకోండి’ అని పేర్కొంది.
ఎంబసీ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కాకుండా సొంతగా వేరే ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరూ హంగేరీ సిటీ సెంటర్లోని రకోజీ యూటీ 90కి చేరుకోవాలని తెలిపింది. కాగా, ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్లో ఉన్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై ఆందోళనలను నెలకొన్న సంగతి తెలిసిందే.
కొందరు విద్యార్థులైతే రోజు మొత్తం మీద నాలుగు బిస్కెట్లు మాత్రమే తిని బతుకుతున్నామని, తమను స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకుంటూ వీడియోలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడం కోసం ‘ఆపరేషన్ గంగ’ను భారత ప్రభుత్వం ప్రారంభించింది.
Important Announcement: Embassy of India begins its last leg of Operation Ganga flights today. All those students staying in their OWN accommodation ( other than arranged by Embassy) are requested to reach @Hungariacitycentre , Rakoczi Ut 90, Budapest between 10 am-12 pm
— Indian Embassy in Hungary (@IndiaInHungary) March 6, 2022