Harish Rao : ‘మే డే’ సందర్భంగా కార్మికులకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం. చెమట చుక్క విలువను కాపాడుకుందాం. కలిసి కట్టుగా మన హక్కులపై పోరాడుదాం. కార్మిక లోకానికి ‘మే డే’ శుభాకాంక్షలు’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుతోపాటు తాను ఆటోవాలా అంగీ వేసుకుని ఆటో నడిపిన ఫొటోను షేర్ చేశారు.
అదేవిధంగా కార్మికులకు సంబంధించి..
అంటూ ‘శ్రీ శ్రీ’ రాసిన కవితను హరీశ్రావు జతచేశారు.
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం
– శ్రీ శ్రీశ్రమిద్దాం.. శ్రమని… pic.twitter.com/bKaPPhoNlu
— Harish Rao Thanneeru (@BRSHarish) May 1, 2024