హైదరాబాద్ : నగరం నడిబొడ్డున దారుణ హత్య(Brutal murder) చోటు చేసుకుంది. చిరు వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళ్తే..సనావుల్లా(24) అనే వ్యక్తి గుడిమల్కాపూర్లో (Gudimalkapur) రోడ్డు పక్కన పూల వ్యాపారం( Florist) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, అతడు పూలు అమ్ముతుండగా అతడి దగ్గరకు వచ్చిన ఇద్దరు దుండగులు మొబైల్ ఇవ్వాలని అడగగా, తాను ఇవ్వడానికి నిరాకరించాడు.
దీంతో దుండగులు లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతీపై పొడిచి మొబైల్ లాక్కొని పరారయ్యారు. గమనించిన పోలీసులు సనావుల్లాను హాస్పిటల్కు తరలించగా అప్పటికే సనావుల్లా మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.