హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ గ్రాండ్ప్రి-1 టోర్నీలో తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గాదె స్వర్ణం సహా కాంస్య పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును నిత్య 11.78 సెకన్ల టైమింగ్తో ముగించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
సర్బానీనంద(ఒడిశా), సుదీక్ష(కర్ణాటక) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల 200మీ రేసులో నిత్య 24.01సె టైమింగ్తో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో విస్మయ(కేరళ), సర్బానీనంద(ఒడిశా) స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు.