సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు రెండో విజయం. సిల్హెట్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో హర్మన్ప్రీత్ కౌర్ సేన 19 పరుగుల (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లకు 119 పరుగులకే ఆలౌట్ అయింది.
ముర్షీదా ఖాన్ (46) టాప్ స్కోరర్ కాగా భారత స్పిన్నర్లు రాధా యాదవ్ (3/19), శ్రేయాంక (2/24) ప్రత్యర్థిని కట్టడిచేశారు. అనంతరం స్వల్ప ఛేదనలో భారత్.. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి 5.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 47 పరుగులు చేసింది.