కోల్కతా: ఐపీఎల్-17లో కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణాకు ఐపీఎల్ పాలకమండలి షాకిచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం ముగిసిన మ్యాచ్లో అతడు ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో వంద శాతం కోతతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది.
ఢిల్లీతో మ్యాచ్లో అభిషేక్ పొరెల్ను ఔట్ చేశాక రాణా స్పందించిన తీరే ఇందుకు కారణం. అంతకుముందు రాణా.. హైదరాబాద్తో మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను ఔట్ చేశాక ‘ఫ్లైయింగ్ కిస్’ ఇస్తూ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోల్పోయాడు.