సిద్దిపేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లెల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, యాసంగి ధాన్యం కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేస్తున్నారు. ధాన్యం చేతికందే సమయంలో రైతన్నకు ప్రభుత్వం దన్ను గా నిలుస్తున్నది. మరో పది, పదిహేను రోజుల్లో యాసంగి వరి కోతలు ప్రారంభం కానుండగా, ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ది. జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి, సుమరుగా 5,46,848 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. కొనుగోలు కేంద్రాలపై యంత్రాంగానికి మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేస్తున్నారు.
కలిసి వచ్చిన కాలం..
ఈసారి వర్షాలు బాగా కురువడం.. చెరువులు, కుంటలు చెక్డ్యాంలు పొంగిపొర్లడంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. జిల్లాలో రంగనాయక, కొండపోచమ్మతో పాటు తపాస్పల్లి రిజర్వాయర్, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, కూడవెల్లి వాగు పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వరి సాగైంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జిల్లా, మండల కమిటీతో పాటు గ్రామ రైతుబంధు స మితులు చురుకుగా పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా ధాన్యం కొం టారు. పెద్ద గ్రామాలైతే ఒకటి, చిన్న గ్రామాలైతే రెండు గ్రామాలు కలిపి ఒక సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అవసరాల మేరకు ఎక్కడికక్కడే సెంటర్లు ఏర్పాటు చేసేలా అధికారులు సిద్ధంగా ఉన్నారు. 24 మండలాల్లో 2లక్షల 83 ఎకరాల్లో వరి సాగైంది. గతంలో ఎన్నడూ లేనంతగా సాగు పెరగడంతో ధాన్యం దిగుబడి అధికంగా రానున్నన్నట్లు అధికారులు గుర్తించారు. మరో పది పదిహేను రోజుల్లో కోతలు ప్రారంభం కానుండగా, ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. వీటిలో మహిళా సంఘాల ద్వారా 220 కేంద్రాలు, సొసైటీల ద్వారా 114, మార్కెట్ కమిటీలు, మెప్మా ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. అవసరాల మేరకు ఎక్కడికక్కడ సెంట ర్లు ఏర్పాటు చేసేలా అధికారులు సిద్ధంగా ఉన్నా రు. జిల్లా నుంచి 5,46,848 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ప్రస్తుతం 53 లక్షల గన్నీ బ్యా గులు సిద్ధంగా ఉన్నాయి. మరో 83 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, వాటిని తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. రైతులకు గతంలో మాదిరిగానే వెనువెంటనే చెల్లింపులు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
తేమ శాతం 17కు మించొద్దు..
మరో 15 రోజులైతే వరి కోతకు రానున్నది. రైతుల ముంగిటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. వరి కోయగానే, ధాన్యాన్ని నేరుగా కేంద్రాలకు తేకుం డా, వాటిని ఆరబోసి, తాలు, తేమ లేకుండా చూ సుకోవాలని తేవాలని సూచిస్తున్నది. ముఖ్యంగా తేమ శాతం 17కు మించొద్దని చెబుతున్నది. నిబంధనల మేరకు ధాన్యం తెచ్చి, మద్దతు ధర పొందాలని పేర్కొంటున్నది. ఇందుకు అవసరమై న గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచింది. నిర్వాహకులకు శిక్షణతో పాటు ధాన్యం సేకరణ, లోడింగ్, రైస్ మిల్లులకు తరలింపు తదితర అంశాలను తెలియజేసింది. ప్రతి కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభానికి ముందే గన్నీ బ్యాగులు, నీటి సౌకర్యం, మహిళలకు తాత్కాలిక టాయిలెట్స్, క రెంట్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్స్, మాయిశ్చరైజ్ మీటర్లు అందుబాటులో ఉండేలా ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నది.
ఇవీ కూడా చదవండి..
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ