సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోకసభ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పార్టీ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్లా సోహెల్, సికింద్రాబాద్కు మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, అంబర్పేటకు సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, సనత్నగర్కు పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రెడ్డి, ముషీరాబాద్కు మాజీ ఎమ్మెల్సీ సలీం, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి, నాంపల్లికి ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, ప్రభాకర్ రావు, ఖైరతాబాద్కు సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్లను నియమించారు. ఆయా డివిజన్లకు సమన్వయకర్తలుగా నియమించగా..
వెంకటేశ్వర కాలనీకి కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఖైరతాబాద్కు పార్టీ సీనియర్ నేత మన్నె గోవర్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్కు కార్పొరేటర్ వెంకటేశ్, బంజారాహిల్స్కు మాజీ చైర్మన్ విప్లవ్కుమార్, హిమాయత్నగర్కు హేమలత, సోమాజిగూడకు పార్టీ సీనియర్ నాయకులు ఆశిష్ యాదవ్లను నియమిస్తూ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అందరిని సమన్వయం చేసుకుంటూ, సరికొత్త ప్రణాళికలతో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా సమన్వయకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.