మద్దూరు, జూన్ 23 : వరిసాగులో రైతులు వెదజల్లె విధానం అనుసరిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గి, అధిక లాభాలు సాధించవచ్చునని ఏఈవో రాకేశ్ అన్నారు. బుధవారం మండలంలోని ధర్మారంలో సర్పంచ్ ఊట్ల రవీందర్రెడ్డి అధ్యక్షతన ‘వెదజల్లె’ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈవో మాట్లాడుతూ.. రైతులు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంతో సాగు ఖర్చులు అధికం కావడంతోపాటు కూలీల కొరత వేధిస్తుందన్నారు. ఇటీవలి కాలంలో ‘వెదజల్లె’ విధానంలో పంటలు సాగు చేసిన రైతులకు అధిక దిగుబడులు వచ్చాయన్నారు. అనంతరం కంది విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మ ఏటీఎం భారతిరాజా, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ ఇప్ప శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
వెదజల్లె పద్ధతితో అధిక దిగుబడులు : ఏవో మల్లేశం
వెద పద్ధ్దతిని అవలంభిస్తే వరి పంటలో అధికంగా దిగుబడులు వస్తాయని ఏవో మల్లేశం అన్నారు. అందె గ్రామంలో సర్పంచ్ చుక్క శంకర్ అధ్యక్షతన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో కంది విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సూకురి లింగం, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. వెదసాగుతో రైతులకు మేలు జరుగుతుందని ఏవో మోహన్ తెలిపారు. తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో వెద సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింహులు, ఏఈవో నవీన్కుమార్, రైతు బంధు అధ్యక్షుడు స్వామిగౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్గౌడ్ ఉన్నారు. కూలీల కొరత తగ్గి పెట్టుబడి మిగులుతుందని దౌల్తాబాద్ ఏవో గోవిందరాజులు అన్నారు. శేరిపల్లి బందారం గ్రామంలో రైతులకు వెదజల్లే పద్ధ్దతి సాగుపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్నాజనార్దన్రెడ్డి, ఎంపీటీసీ నవీన్, ఏఈవోలు ప్రవీణ్, సంతోశ్కుమార్ పాల్గొన్నారు.
పెట్టుబడి తగ్గుతుంది : ఎంపీపీ అమరావతి
వెద పద్ధతిలో పెట్టుబడి వ్యయం తగ్గుతుందని ఎంపీపీ అమరావతీశ్యాంమనోహర్ అన్నారు. గజ్వేల్ మండలంలోని అక్కారం, శ్రీగిరిపల్లి, కోమటిబండ, కొడకండ్ల, కొ ల్గూర్ గ్రామాల్లో వెదజల్లె పద్ధతిపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ మద్దూరి శ్రీనివాస్రెడ్డి, మండల కోఆర్డినేటర్ మద్దిరాజిరెడ్డి ప్రసంగించారు. వెదపద్ధతిలో రైతుకు కూలీల ఖర్చుతోపాటు ఇతర పెట్టుబడి వ్యయం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ శేఖర్పటేల్, బాలచంద్రం, రాజు, విజయ, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, ఏఈవోలు పాల్గొన్నారు.వెద పద్ధ్దతిలో పంటకాలం తగ్గి అధిక దిగుబడులు వస్తాయని మర్కూక్ ఏవో నాగేందర్రెడ్డి వివరించారు. ఇప్పలగూడెంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, సర్పంచ్ ప్రసన్నాసుధాకర్రెడ్డి, ఏఈవో రజనీకాంత్ పాల్గొన్నారు. వర్గల్ మండలంలోని నాచారం నిర్వహించిన కార్యక్రమంలో రైతు లకు ఏవో సకలేశ్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్గౌడ్, ఏఈవో లక్ష్మణ్
12 నుంచి 14 శాతం పెట్టుబడి తగ్గుతుంది
బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్, తోటపల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. తో ర్నాల పరిశోధన కేంద్రం శాస్త్రవేత కిశోర్ వెదజల్లే పద్ధ్దతిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏవో సంధ్య, సర్పంచ్లు అన్నాడి సత్యనారాయణ, బొయినిపల్లి నర్సింగరావు పాల్గొన్నారు.కోహెడ మండలం తీగలకుంటపల్లిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల చంద్రశేఖర్రెడి, ఏఈవో రేఖ పాల్గొన్నారు. వరిలో వెదజల్లుడు పద్ధతిలో 12 నుంచి 14 శాతం పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడి అధికంగా వస్తుందని ఏఈవో వివరించారు.