కొత్తపల్లి, ఏప్రిల్ 25 : ఇంటర్ ఫలితాల్లో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రస్థాయి మార్కులు సాధించి మరోసారి సత్తా చాటారని కరస్పాండెంట్ సీహెచ్ సతీశ్రావు పేర్కొన్నారు. రేకుర్తిలోని కళాశాల ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఫస్టియర్ ఎంపీసీ విభాగంలో కనకట్ల మారుతి, మోర్రె రాజేశ్ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి ప్రతిభను చాటారు అలాగే అదే విభాగంలో ముక్కెర దేవేందర్ 465, ముడిగొండ మల్లికార్జున్ 464, అరుకొండ సంజయ్ 461, మంగళారపు సాయి ప్రణయ్ 460, ఆర్ తరుణ్ 438 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో మంథెన సన్నీ 440 మార్కులకు గాను 435 మార్కులు, గుగులోతు రాజశేఖర్ 431 మార్కులు సాధించారు. సీఈసీలో ముక్కెర మనోజ్కుమార్ 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించాడు. అలాగే సెకండియర్ ఎంపీసీలో తాపళ్ల గణేశ్ 983, ఉత్కం హరీశ్ 981 మార్కులు, సీఈసీలో కలువ అభిషేక్ 902 మార్కులు సాధించి ప్రతిభను కనబరిచారు.