సిద్దిపేట కలెక్టరేట్, మే 17 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ జిల్లాలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 13 కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి సందర్శించారు. వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, స్థానిక అధికారు లు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను అప్పటికప్పుడు పరిష్కారం చూపా రు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును రైతు లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, క్లస్టర్ ఇన్చార్జిలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 70 శాతం ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాల్సి ఉందని చెప్పారు.
అందుబాటులో 15 లక్షల గన్నీ బ్యాగులు..
జిల్లాలో 15 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, రోజుకు ఐదు లక్షల గన్నీ బ్యా గులను సరఫరా చేయాలని పౌరసరఫరా సంస్థ కమిషనర్ను కలెక్టర్ కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వేగంగా తరలించేందుకు అవసరమైన వాహనాలను అధికారులకు సమకూర్చడంలో జిల్లాలో ట్రాన్స్పోర్టు ఏజెన్సీలు విఫలమయ్యారన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలను స్వాధీనం చేసుకుంటుందన్నారు. సోమవారం 200 పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాలతో వచ్చే పది రోజుల పాటు ధాన్యం తరలించేందుకు ఉపయోగిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా వాహనాలకు అద్దెచార్జీలను చెల్లిస్తామన్నారు. స్థానికంగా ట్రాక్టర్లను ఉపయోగించుకునే బాధ్యతను క్లస్టర్ ఇన్చార్జిలకు అప్పగించినట్లుగా తెలిపారు. జిల్లాలో అన్ని కంపెనీల్లో పనిచేసే కార్మికులతో పాటు స్థానికంగా ఆసక్తి ఉన్న యువతను ధాన్యం తరలించడంలో భాగస్వా మ్యం చేస్తామన్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కె ట్ కమిటీ గోడౌన్లు, నాబార్డు గోడౌన్, పాఠశాల భవనాలు, రైతు వేదికలు, ఫంక్షన్హల్, ధా న్యం నిల్వల చేసుకునేందుకు వీలును అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి గోపాలరావు తదితరులు ఉన్నారు.