సిద్దిపేట టౌన్, అక్టోబర్ 24 : జిల్లా కేంద్రంలో పోలీసులు పాన్షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వన్టౌన్ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. గంజాయి, గుట్కా ఇతర మత్తు పదార్థాలు పాన్షాపుల్లో విక్రయిస్తున్నారన్న నమ్మదిగన సమాచారంతో వన్టౌన్, టూటౌన్ పరిధిలో తనిఖీలు చేపట్టామన్నారు.
ఈ సందర్భంగా వన్టౌన్ పరిధిలో 3, టూటౌన్ పరిధిలో 4 పాన్షాపులపై కేసు నమోదు చేసి సుమారు రూ.26 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారం ఉంటే డయల్ యువర్ 100, పోలీసు కమిషనరేట్ వాట్సాప్ నంబరు 7901100100 లో సమాచారం ఇవ్వాలని కోరారు.