హుస్నాబాద్ రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ శివారులో లేగదూడపై హైనా దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామశివారులో పాశం సంపత్ వ్యవసాయ బావి వద్ద లేగదూడను కట్టివేయగా తెల్లవారుజామున దూడపై హైనా దాడి చేసి చంపివేసినట్లు చెప్పారు.
సంఘటన స్థలాన్ని వెటర్నరీ అదికారులు సందర్శించారు. లేగదూడపై దాడిచేసింది హైనా అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. రైతులు తమ పశువులను శివారు ప్రాంతాల్లో కాకుండా జనావాసాల్లో కట్టివేయాలని సూచించారు.