దళితబంధు పథకం ఏర్పాటుపై దళిత నాయకుల హర్షం
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
సిద్దిపేట, జూలై 21 : దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు దళితబంధు పథకం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అయ్యాడని.. భవిష్యత్ తరాలకు అభినవ అంబేద్కర్గా మారారని సిద్దిపేట నియోజకవర్గ దళిత నాయకులు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నంగునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, డీసీఎంఎస్ డైరక్టర్ నముండ్ల రాంచంద్రం, సిద్దిపేట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎర్ర యాదయ్య, గ్యార యాదగిరి, గుర్రాల శ్రీనివాస్, బెల్లె రాము లు, భీమసేన, జువ్వన్న కనకరాజ్ తదితరులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ైప్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. దళితుల అభ్యున్నతికి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ఏర్పాటు చేయడంపై దళితులంతా హర్షం వ్యక్తం చేశారు.