ఒకప్పుడు తెలుగు హీరోలు..తమిళ హీరోలు.. మలయాళ హీరోలు అంటూ సపరేట్ సపరేట్ గా ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బౌండరీస్ క్లియర్ అయిపోయాయి. కేవలం సినిమా మాత్రమే మాట్లాడుతుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. అందుకే అందరు హీరోలు అన్ని ఇండస్ట్రీలలో అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలు తమిళం, హిందీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర భాషల హీరోలు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
టాలీవుడ్ పెద్దగా పట్టించుకోని కన్నడ హీరోలు కూడా ఈ మధ్య వరుసగా తెలుగులో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక మలయాళ హీరో తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ చేస్తున్నాడు. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్స్ మాత్రమే తెలుగులో కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరం హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒక్కడే తెలుగులో కూడా తన సినిమాలను రెగ్యులర్ గా విడుదల చేస్తున్నాడు. దానికి తోడు మహానటి సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అంతకు ముందే ఓకే బంగారం సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. కనులు కనులను దోచాయంటే సినిమా కూడా ఇక్కడ మంచి వసూళ్లు సాధించింది.
ఇక ఇప్పుడు నివిన్ పాలీ కూడా తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ చేస్తున్నాడు. ఐదేళ్ల కింద ప్రేమమ్ సినిమాతో ఈయన సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది. ఈ సినిమాను మలయాళంతో పాటు నేరుగా తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఇకపై నివిన్ నటించే సినిమాలు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఈ హీరో ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఫారెస్ట్ ఆఫీసర్ గా విద్యాబాలన్..టీజర్
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
Recommended Content by ntnews.comAdvertisement