వాషింగ్టన్ : కరోనా వైరస్, 9/11 దాడులకు మధ్య ఏమైనా సంబంధం ఉన్నదా? అని అంటే రెండు వేర్వేరు సంఘటనలనే చెప్పాలి. ప్రస్తుతం కరోనా వైరస్ను అడ్డుకునేందుకు సిద్ధం చేసిన ఎం ఆర్ఎన్ఏ వ్యాక్సిన్.. ఎప్పుడో 20 ఏండ్ల క్రితం 9/11 తర్వాత అంత్రాక్స్ దాడుల నేపథ్యంలో బీజం పడినట్లుగా తెలుస్తున్నది. వాస్తవానికి యుద్ధంలో తమ సైన్యంపై జీవశాస్త్రపరంగా వైరస్తో దాడి చేస్తే ఎలా అని ఆంత్రాక్స్ దాడుల సమయంలో అమెరికా కలత చెందిందా? అనేది చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత పెంటగాన్స్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డీపీఆర్ఏ) మసాచుసెట్స్కు చెందిన కంపెనీ మోడెర్నాకు ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టు ఇచ్చింది. ఇవాళ ఈ టెక్నిక్ ఆధారంగానే ఎం ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కరోనా వైరస్ను నిరోధించిన తర్వాత క్యాన్సర్ను చంపడానికి దాదాపు సిద్ధంగా ఉంది. ఎం ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా క్యాన్సర్ వ్యాక్సిన్ బీఎన్టీ111 ఫేజ్-2 తొలిసారిగా ఒక క్యాన్సర్ రోగిపై పరీక్షించారు.
కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించేందుకు వినియోగిస్తున్న వ్యాక్సిన్లతోనే క్యాన్సర్లకు కూడా అడ్డుకట్ట పెట్టొచ్చునంట. తమ సైన్యంపై బయలాజికల్ అటాక్స్ జరుగకుండా ఉండేందుకు అమెరికా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ రకం వ్యాక్సిన్తో ఓరోఫారింజియల్ క్యాన్సర్, సైర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, వివిధ ట్యూమర్లను తొలగించేందుకు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది వివిధ క్యాన్సర్ల బారిన పడి మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎం ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మన శరీరంలోని కణాలను కరోనా వైరస్ వంటి చిట్కాతో ప్రోటీన్లను తయారు చేయమని ఆదేశిస్తుంది. ఈ ప్రోటీన్ తయారైన వెంటనే మన కణాలు దానిని విచ్ఛిన్నం చేస్తాయి. గుర్తించబడిన ప్రోటీన్లు మన కణాల ఉపరితలంపై కనిపించడం ప్రారంభిస్తాయి. మన రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్లను గుర్తించి వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేస్తుంది. భవిష్యత్లో కరోనా వైరస్ సోకినట్లయితే మన శరీరం వైరస్ను గుర్తించి మన రక్షణ కణాలు వాటిని చంపుతాయి. అదేవిధంగా, క్యాన్సర్ విషయంలో కూడా ఎం ఆర్ఎన్ఏ టీకా మన శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేస్తుంది. మొత్తంగా, మన రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించడం, చంపడం కూడా నేర్చుకుంటుందన్నమాట.
పారాలింపిక్ షూటర్కు ‘సుప్రీం’లో ఊరట
పెగాసస్పై దర్యాప్తు చేయాలి : సీఎం నితీష్ కుమార్
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
ఈ చట్టం కింద ఇంకా కేసులా?.. సుప్రీంకోర్టు షాక్
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..