Maoist Surrender : మావోయిస్టు అగ్రనేత పాపారావు (Papa Rao) అలియాస్ సున్నం చంద్రయ్య లొంగిపోయారు. తన అనుచరులతో కలిసి ఆయన బీజాపూర్ ఎస్పీ ఎదుట సరెండర్ అయ్యారు. ఆయనతో పాటు లొంగిపోయిన 17మందిలో.. 10 మంది పురుషులు, 8 మంది మహిళా మావోయిస్ట్లు ఉన్నారు. వీరినుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరో కీలక నేత సుక్రు సైతం ఒడిశాలో లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్ ఉధృతమవ్వడం, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వాలు పునరావాసం కల్పిస్తున్న నేపథ్యంలో కీలక నేతలు జనం వీడుతున్నారు. ఇప్పటికే పలువరు కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలవగా బస్తర్కు చెందిన పాపారావు కూడా లొంగిపోయారు. ఆయనపై రూ.2 కోట్ల రివార్డు ఉంది. పావార 50కి పైగా ఏసులు 76 మంది భద్రతా సిబ్బంది హత్యలో పాపారావు హస్తముంది.సుక్మా జిల్లా కలెక్టర్ కిడ్నాప్ కేసులోనూ ఆయన పాత్ర ఉంది. ఒడిశాలో లొంగిపోయిన సుక్రుపై రూ.55 లక్షల రివార్డు ఉంది.